అవతరిస్తూనే తల్లి తండ్రుల భవ బంధాలను త్రెంచివేశాడు. తనను ప్రేమించిన గోపికా గోపాలురకు, ద్వేషించిన రాక్షసులకు కూడా ముక్తిని ప్రసాదించాడు. గోపికల అజ్ఞాన వస్త్రాలను అపహరించి వారికి జ్ఞాన వస్త్రాలను ప్రసాదించాడు. జీవాత్మకు పరమాత్మకు మధ్య అనునిత్యం జరుగుతూ ఉండే అద్భుత క్రీడను రాసలీల రూపంలో మనకు వివరించాడు. ప్రేమకు అందంతో సంబంధం లేదని కుబ్జ ద్వారా నిరూపించాడు. స్నేహానికి అంతస్తులతో పని లేదని కుచేలుని ద్వారా నిరూపించాడు. తనను ఆశ్రయించిన పాండవులను అడుగడుగునా రక్షించాడు. తనను వ్యతిరేకించిన కౌరవులను కూడా మంచి మార్గంలో పెట్టటానికి చివరి వరకు ప్రయత్నించాడు. అన్నా అని అర్థించిన ద్రౌపది మానాన్ని అక్షయ వలువలిచ్చి కాపాడాడు. ఆహవరంగంలో కర్తవ్యతా విమూఢుడై దిశా నిర్దేశానికి ప్రార్థించిన అర్జునుని నెపంగా పెట్టుకుని మానవులందరికీ తరతరాలకీ ఆచారణీయమైన భగవద్గీతను ప్రసాదించాడు. అట్టి జగద్గురుదేవుడైన గీతచార్యునికి జన్మాష్టమి సందర్భంగా నా శత సహస్ర వందనాలు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి