అందరూ మన జనాభాని అదుపు చెయ్యాలంటారు కానీ ఇంటికి ఒక్కరినే కంటే చివరికి మన తరువాతి తరమంతా ఒంటరి బ్రతుకులు అయిపోతాయి. లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళేమో పిల్లలనే కనట్లేదు. కూటికి కూడా గతి లేని వాళ్ళు గంపెడు సంతానాన్ని కంటున్నారు. అవినీతిని ఆర్థిక అసమానతలను తొలగిస్తే జనాభా ఒక సమస్యే కాదంటాను. మరి మీరేమంటారు?
దీనిపై మా మిత్రుడు రవి ఒక చమత్కారమైన వ్యాఖ్య చేసాడు. పేదవారు అంతమంది పిల్లలను ఎందుకు కంటారంటే - కనీసం వారైనా తాము చెయ్యలేకపోయిన పని చేస్తారనిట. ఇంతకీ ఆ పని ఏమిటయ్యా అంటే ఒక గొప్పింటి పిల్లని పెళ్ళిచేసుకుని స్థిరపడటం. పైగా తను కూడా చాల సార్లు అలాగే కలలు కన్నాట్ట కానీ పాపం అది జరగలేదు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి