6, అక్టోబర్ 2016, గురువారం

జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయినీ

మనం ఒక చిన్న పిల్లవాడిని బొమ్మల కొట్టులోకి తీసుకుని వెళ్ళామనుకోండి, వాడు ఒక్కసారిగా అన్ని బొమ్మలను చూసేసరికి ఆనందం పట్టలేక వాటితో ఆడుకోవటం మొదలుపెడతాడు. అలా కొన్ని బొమ్మలతో ఆడి, వాటిని వదలి మరికొన్ని బొమ్మల వెంటపడతాడు. ఇలా పూటంతా రకరకాల బొమ్మలతో మళ్ళీ మళ్ళీ ఆడి అలసిపోతాడు. అప్పుడు వాడికి అమ్మ ఒడి లభించిందనుకోండి ఇంక ప్రపంచాన్నంతా మరచిపోయి ఆదమరచి నిద్రపోతాడు. దానిని మించిన సుఖం వాడికి ఇంకేదైనా ఉంటుందా? ఎంత అల్లరి పిల్లవాడైనా, చిచ్చరపిడుగైనా తల్లి ఒడిలో చేరితే ప్రశాంతంగా నిద్రపోవలసిందే కదా?

మరి అలాగే మన తల్లియైన జగన్మాత మనలను ఈ బొమ్మల లోకంలో విడిచిపెట్టింది. ఈ బొమ్మల మధ్యలో మళ్ళీ మళ్ళీ పుడుతూ, చస్తూ, ముసలివాళ్ళం అవుతూ ఇలా ఎంతకాలమని ఆడుతాం? ఎప్పటికైనా మనకి కూడా ఈ పరుగులనుండి విశ్రాంతి తీసుకోవాలని ఉంటుంది కదా? మరి అలాంటప్పుడు మనకి ఉన్న ఏకైక మార్గం ఆ తల్లి ఒడి చేరుకోవటమే. అదే మోక్షమంటే. అందుకే ఆవిడ ముకుందా, ముక్తి నిలయ కూడా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి