సాధారణంగా మనకు ఏదైనా ప్రభుత్వ శాఖలో పని కావాలంటే ఆ శాఖలోని క్రింది స్థాయి ఉద్యోగస్థులతో మొదలుపెట్టి కార్యదర్శిదాకానో మంత్రిదాకానో బ్రతిమాలుతూ తిరుగుతాం. అదే ప్రధానమంత్రితో మనకు గాఢమైన స్నేహం ఉందనుకోండి, ఆ మంత్రులే మనకు ఎదురువచ్చి మనకు కావలసిన పనులన్నీ చిటికెలో చేసిపెడతారు.
ఈ రోజులలో ప్రతివారూ ముఖ్యంగా కోరుకునేవి రెండు - తమకు అంతులేని సంపద, తమ బిడ్డలకు అపార విద్య. మరి ఈ ఆర్థిక శాఖకు, విద్యాశాఖకు అధిపతులైనవారు ఎవరు? లక్ష్మీదేవి, సరస్వతీదేవి కదా? వారిద్దరూ ఏం చేస్తూ ఉంటారో ఈ నామం చెప్తోంది. వారిద్దరూ ఎల్లప్పుడూ జగన్మాతకు కుడి ఎడమలలో నిల్చొని సేవికలవలే ఆ తల్లికి వింజామరలు వీస్తూ ఉంటారు.
మరి ఆ జగన్మాతను హృదయంలో నింపుకొని ఆ తల్లియందు గాఢమైన భక్తి ప్రపత్తులను కలిగినవారికి అటు సంపదలో కానీ ఇటు విద్యలో కానీ లోటు ఏం ఉంటుంది? దీనికి మనకు అటు మహాకవి కాళిదాసు, ఇటు తెనాలి రామలింగకవుల జీవితాలే ప్రత్యక్ష నిదర్శనాలు. ఇంత స్పష్టంగా మన కోరికలు తీరటానికి సుళువైన మార్గం కనిపిస్తూ ఉంటే, దానిని వదిలివేసి లోకంలో వాళ్ళ కాళ్ళూ వీళ్ళ కాళ్ళూ పట్టుకొనేవారు ఎంతటి అవివేకవంతులు?
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి