6, మార్చి 2016, ఆదివారం

ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః

పేడ ఎంతో తడిగా చేతికి అంటుకుంటూ, పురుగులతో కులకులలాడుతూ, దుర్గంధభూయిష్టంగా ఉంటుంది. అదే పేడను ఎండబెట్టి అగ్నిలో దగ్ధం చేస్తే విభూతిగా మారుతుంది. అది సువాసనలను వెదజల్లుతూ అందరికీ ఆహ్లాదకరంగా ఉంటుంది. దానికి అంటుకునే స్వభావం పోయి ఉఫ్ అని ఊదగానే ఎగిరిపోతుంది. అసలే తెల్లగా ప్రకాశించే పరమేశ్వరుడు ఎంతో ప్రీతితో ఆ భస్మాన్ని తన దేహమంతా అలదుకొని మరింతగా ప్రకాశిస్తాడు. మలిన స్థితిలో మన మనస్సు కూడా అలాగే అన్నింటికీ అంటుకుంటూ, సంకల్పాలతో కోరికలతో నీచభావాలతో కులకులలాడుతూ, దుర్గంధభూయిష్టంగా ఉంటుంది. ఆ మనస్సును వైరాగ్యంతో ఎండబెట్టి, ధ్యానాగ్నిలో దగ్ధం చేస్తే అది పవిత్రమైన విభూతివలె శుద్ధమనస్సుగా మారుతుంది. అది తన అంటుకొనే స్వభావాన్ని కూడా కోల్పోతుంది. విభూతిని శరీరమంతా పూసుకోవటం అంటే ఎంతో ఇష్టపడే పరమేశ్వరుడు అటువంటి మనస్సు అంతా తానే నిండిపోతాడు. అంతకు మించిన పరమ శాంతి ఎక్కడ ఉంటుంది? అటువంటి పరమ శాంతిని ఆ భస్మోద్ధూళిత విగ్రహుడైన పరమేశ్వరుడు మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ శ్రీమహాశివరాత్రి శుభాకాంక్షలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి